Sunday, April 28, 2024

విశాఖ‌లో భారీగా గంజాయి ప‌ట్టివేత

ఏపీలోని విశాఖ‌ప‌ట్నం జిల్లాలో భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. గంజాయి తోటలు ధ్వంసం చేసి, అరికట్టాలని అధికారులు చెబుతున్నా అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా విశాఖ జిల్లా మాడుగుల మండలం గరికబంధ చెక్ పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో నిర్వహించిన తనిఖీల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికింది. ఆటోలో తరలిస్తున్న రూ.10 లక్షల విలువైన 197 కేజీల గంజాయిని పట్టుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఒక ఆటో, 4 బైకులు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement