Friday, March 29, 2024

‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ – ఏప్రిల్ 6నుండి నెక్ట్స్ షెడ్యూల్

మొగ‌ల్ చ‌క్ర‌వ‌ర్తుల కాలంలోని క‌థ‌తో న‌డుస్తుంది హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చిత్రం. ఈ చిత్రంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్నారు.కాగా ఈ చిత్రంకోసం ఆ కాలానికి సంబంధించిన సెట్స్ వేయటడానికి ఆర్ట్ డైరెక్టర్ తోట తరణిని రంగంలోకి దింపారు. ఆయన రూపకల్పనలో సెట్స్ నిర్మాణం జరుగుతోంది. కరోనా కారణంగా .. ‘భీమ్లా నాయక్’ సినిమాతో పవన్ బిజీ గా ఉండటం వలన, ఈ సినిమా షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఇప్పటికి 50 శాతం మాత్రమే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతూ వచ్చింది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి తదుపరి షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టాలనే నిర్ణయానికి టీమ్ వచ్చినట్టుగా సమాచారం. ఇప్పటికే చాలా ఆలస్యం కావడం వలన, సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని అంటున్నారు. ఈ సినిమాలో ఒక గజదొంగ పాత్రలో పవన్ కనిపించనుండగా, ‘పంచమి’ అనే పాత్రలో నిధి అగర్వాల్ అలరించనుంది. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement