Sunday, April 28, 2024

ట్రాఫిక్ మ‌ధ్య‌లో టిఫిన్ చేసిన వ్య‌క్తి – వైర‌ల్ గా వీడియో

మ‌ద్యం తాగేసి ఉన్న వ్య‌క్తి రోడ్డు మ‌ధ్య‌లో కూర్చుని ఆహారాన్ని తిన‌డం ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఈ సంఘ‌ట‌న క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో బ‌స‌వేశ్వ‌ర‌న‌గ‌ర్ లో చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి టిఫిన్, వాట‌ర్ బాటిల్ ప‌ట్టుకుని న‌డిరోడ్డుపైకి వ‌చ్చి, అక్క‌డే కూర్చొని తిన్నాడు. ర‌ద్దీగా ఉన్న ఆ రోడ్డుపై అత‌డు ప్ర‌వ‌ర్తించిన తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేసింది.ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. ఆ స‌మ‌యంలో ఆ వ్య‌క్తి మ‌ద్యం తాగి ఉన్నాడు. దోశ, వాటర్ బాటిల్ తో రోడ్డు మధ్యలో కూర్చుని, చాలా సేపు దోశ తిన్నాడు. వాహ‌నాలు పక్క నుంచి వెళ్లాల‌ని, టిఫిన్ తింటోన్న స‌మ‌యంలో త‌న‌ను డిస్ట‌ర్బ్ చేయ‌కూడ‌ద‌ని అత‌డు వాహ‌న‌దారుల‌కు సూచించ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement