Friday, March 29, 2024

చంద్ర‌బాబు ఏడ్చిన‌ప్పుడే టిడిపి ప‌ని అయిపోయింది – మంత్రి అంబ‌టి రాంబాబు

టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడు ఏడ్చిన‌ప్పుడే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింద‌న్నారు నీటిపారుద‌ల‌శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు.. ఏడ్చేవారు రాజకీయాలకు పనికి రారని చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు అన్నారు. 2024 లో మళ్ళీ వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు..జగన్‌ వ్యతిరేక శక్తులందరినీ విడిపోనివ్వనని పవన్‌ కల్యాణ్‌ ప్రగల్భాలు పలుకుతున్నారని నిప్పులు చెరిగారు. పవన్‌ కల్యాణ్‌ సీఎం అవడానికి పార్టీ పెట్టారో, చంద్రబాబుని సీఎం చెయ్యడానికి పార్టీ పెట్టారో ముందు తేల్చుకోవాలని అంబటి రాంబాబు చురకలు అంటించారు. నేనేమీ అనకపోయినా ఏదో అన్నట్టు చంద్రబాబు ఏడ్చారన్నారు. గెలుపు ఓటములు, ఒడుదొడుకులు వచ్చినా హీరోలా ఉండేవారే రాజకీయాల్లో ఉంటారు. ఏడ్చేవారు రాజకీయాలకు పనికి రారని చురకలు అంటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement