Friday, May 3, 2024

అలర్ట్: ఏపీలో పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరికలు

ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అటు ప్రకాశం, గుంటూరు, విశాఖ, విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాలకు విపత్తుల నిర్వహణ శాఖ పిడుగుల హెచ్చరికలు జారీ చేసింది.

ప్రకాశం జిల్లా: ఎర్రగొండపాలెం, పెద్దరావీడు, త్రిపురాంతకం, దొనకొండ, మార్కాపురం, దోర్నాల, అర్ధవీడు, రాచర్ల, పుల్లలచెరువు, కురిచేడు, కనిగిరి
గుంటూరు జిల్లా: నూజెండ్ల, వినుకొండ, వెల్దుర్తి, మాచెర్ల, రాజుపాలెం
విశాఖ జిల్లా: జీకె వీధి, చింతపల్లి, జి.మాడుగుల, కొయ్యూరు
విజయనగరం జిల్లా: సాలూరు, మక్కువ
కర్నూలు జిల్లా: డోన్, పత్తికొండ, మద్దికేర తూర్పు, వెల్దుర్తి
అనంతపురం: ఉరవకొండ, గుంతకల్లు, తలుపుల, పుట్టపర్తి, ఓబులదేవరచెరువు

ఆయా మండలాల పరిసర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం, రాత్రి సమయాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement