Thursday, April 25, 2024

సాదా సీదాగా సీతారాముల కళ్యాణం..

కవాడిగూడ : శ్రీరామనవమి పర్వదినోత్సవంను పురస్కరించుకొని ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని పలు ఆలయాలలో శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవ వేడుకలు సాదా సీదాగా నిర్వహించారు. చిక్కడపల్లిలోని శ్రీ హనుమాన్‌ దేవాలయం చైర్మన్‌ గుండెపూడి మురళిప్రసాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని శ్రీ లక్ష్మిగణపతి దేవాలయం, చైర్మన్‌, ముచ్చకుర్తి ప్రభాకర్‌, దోమలగూడలోని శ్రీహనుమాన్‌ దేవాలయం చైర్మన్‌ వల్లాల శ్యాంయాదవ్‌ ఇవో దేవనాథంలతో కలిసి వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, గాంధీనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ ఏ పావని వినయ్‌కుమార్‌ మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినం మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిభింభమని అన్నారు. అదే విధంగా భోలక్‌పూర్‌ దేవునితోటలోని శ్రీ భవాని శంకర దేవాలయంలో శ్రీరామ నవమి సందర్బంగా శ్రీసీతారాముల కళ్యాణ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నేతలు ముఠా జయసింహా, ఆలయ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement