Saturday, May 18, 2024

MP: ఎన్‌కౌంటర్‌ లో ముగ్గురు మావోయిస్టుల మృతి

ఐదు గంటలపాటు సాగిన ఆపరేషన్‌లో ఓ మహిళతో సహా ముగ్గురు మావోయిస్టులు మరణించిన ఘ‌ట‌న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘాట్ జిల్లాలో చోటుచేసుకుంది. లంజీ హెడ్‌క్వార్టర్స్‌కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహేలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కడ్లా గ్రామంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది.

ఈ ఎన్‌కౌంటర్ లో చ‌నిపోయిన వారు నగేశ్‌, మనోజ్‌, రమే గా గుర్తించారు. వీరిలో నగేశ్‌ డివిజన్‌ కమిటీ సభ్యుడు కాగా, మనోజ్‌ ఏరియా కమిటీ సభ్యుడని పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్‌ను మహారాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా ధ్రువీకరించారు. నగేశ్‌పై రూ.15లక్షల రివార్డ్‌, మనోజ్‌, రమేపై రూ.8లక్షల రివార్డ్‌ ఉందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement