Thursday, May 2, 2024

ఆర్మీ యూనిఫామ్ లో ఒక ఛ‌రిష్మా ఉంది-సైన్యంలో చేరాల‌ని- చేర‌లేక‌పోయా- రాజ్ నాథ్ సింగ్

ఆర్మీ యూనిఫామ్ లో ఒక ఛ‌రిష్మా ఉంద‌ని తెలిపారు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాన‌న్నారు. అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా సైన్యంలో చేరలేకపోయానని చెప్పారు. ఆర్మీలో చేరేందుకు సన్నద్ధమయ్యానని… షార్ట్ సర్వీస్ కమిషన్ కు ఒకసారి దరఖాస్తు కూడా చేసుకున్నానని… అయితే ఆ సమయంలో తన తండ్రి మరణించడంతో సైన్యంలో చేరలేకపోయాన‌న్నారు. తాజాగా ఈ విషయాన్ని చెపుతూ రాజ్ నాథ్ భావోద్వేగానికి గురయ్యారు. రాజ్ నాథ్ సింగ్ ప్రస్తుతం మణిపూర్ లో పర్యటిస్తున్నారు. అక్కడి ఇన్స్ పెక్టర్ జనరల్ అస్సాం రైఫిల్స్ (సౌత్) ప్రధాన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అస్సాం రైఫిల్స్, రెడ్ షీల్డ్ డివిజన్ బృందాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ… ఆయన తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. సైనిక దుస్తులను చిన్న పిల్లాడికి ఇచ్చినా అతనిలో ఒక ఛరిష్మా కనిపిస్తుందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement