Friday, April 26, 2024

Breaking: మూడో వన్డే రద్దు.. వన్డే సిరీస్ కివీస్ కైవసం

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్ రద్దయ్యింది. వర్షం కారణంగా మూడో వన్డే రద్దయ్యింది. మూడు వన్డేల సిరీస్ ను 1-0 తేడాతో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. మూడో వన్డే మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ జట్టు 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 220 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ జట్టు 18 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత వర్షం రావడంతో ఈ మ్యాచ్ రద్దైంది. దీంతో న్యూజిలాండ్ జట్టు ఒక మ్యాచ్ గెలవడంతో మూడు వన్డేల సిరీస్ ను న్యూజిలాండ్ జట్టు కైవసం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement