Thursday, May 9, 2024

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్.. ఫోటోస్ షేర్ చేసిన‌ భారత రైల్వే..

జమ్మూకశ్మీర్ లోని రియాసీలో చినాబ్ నదిపై కొండలను కలుపుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఓ రైల్వే వంతెనను నిర్మిస్తోంది భారత రైల్వే శాఖ‌. ప్యారిస్ లోని ఐఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఎక్కువ ఎత్తుండే ఈ వంతెనను.. రియాసీలోని బక్కల్, కౌరీ మధ్య నిర్మిస్తున్నారు. 2002లో ప్రారంభమైన ఈ ‘ఆర్చ్ బ్రిడ్జి’ నిర్మాణం పూర్తి కావస్తోంది. నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ ‘చినాబ్ రైలు వంతెన’ను నిర్మిస్తున్నట్టు రైల్వే తెలిపింది. ఆర్చ్ పై రైల్వే ట్రాక్ నిలబడేలా 17 ఇనుప పిల్లర్లతో రైల్ బ్రిడ్జిని కడుతున్నారు.

ఈ వంతెనను 1,315 మీటర్ల పొడవున నిర్మిస్తున్నారు. ఆర్చ్ పొడవే 476 మీటర్లుంటుంది. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, 8 తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకుని ఈ వంతెన నిలబడుతుంది. కాగా, ఈ ఫొటోలను రైల్వే శాఖ పోస్ట్ చేయడంతో ఆన్ లైన్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదో సివిల్ ఇంజనీరింగ్ అద్భుతమని ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. భూమి మీదకు స్వర్గం దిగొచ్చిందంటూ కామెంట్ చేస్తున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఓ ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement