Thursday, May 2, 2024

జ‌గ‌న్ తో భేటీ కానున్న ఆర్ ఆర్ ఆర్ టీం..కోర్టుకి వెళ్ల‌బోం అని ప్ర‌క‌ట‌న‌..

స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న పాన్ ఇండియా చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో టికెట్ల ధరల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. టికెట్ల ధరలను పెంచేందుకు కోర్టు వెళ్లేందుకు… ఆర్‌ఆర్‌ఆర్ టీం రెడీ అయినట్లు రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో… ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మాణ సంస్థ… ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చింది. ” టిక్కెట్టు ధరలు తగ్గించడం మా సినిమాపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నది నిజం. కానీ మాకు కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ ను తాము సంప్రదించి… సామరస్యపూర్వక పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం. కోర్టు వెళ్ల బోం” అంటూ ప్రకటించింది డీవీవీ ఎంటర్‌ టెన్‌మెంట్‌.

వకీల్ సాబ్‌ సినిమా సమయంలో టికెట్ల ధరలను తగ్గించింది జగన్‌ సర్కార్‌. అప్పటి నుంచి ఇప్పటి వరకు టికెట్ల ధరలను ఏపీ సర్కార్‌ పెంచలేదు. దీంతో డిస్ట్రీబ్యూటర్లతో పాటు నిర్మాతలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement