Thursday, May 2, 2024

Chai pe Charcha | దాబా చాయ్ మ‌స్తున్న‌ది.. దారి మ‌ధ్య‌లో టీ తాగుతూ కేసీఆర్ చిట్‌చాట్‌!

వ‌రుస ప్రోగ్రాములు, ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌ల‌తో బిజీ బిజీగా ఉంటున్న గులాబీ ద‌ళ‌ప‌తి, సీఎం కేసీఆర్ ఇవ్వాల కాసేపు సేద తీరారు. సిద్దిపేట బ‌హిరంగ స‌భ నుంచి హైద‌రాబాద్ వ‌స్తుండ‌గా పొన్నాల ద‌గ్గ‌ర ఉన్న దాబాలో చాయ్ తాగారు. ఈ సంద‌ర్భంగా త‌న‌తో ఉన్న లీడ‌ర్లతో కాసేపు చిట్ చాట్ చేశారు. సిద్దిపేట దాబా చాయ్ తాగటంతో అలసట అంతా పోయిందని కేసీఆర్ పేర్కొన్నారు.

మంగళవారం సిరిసిల్ల, సిద్దిపేట బహిరంగ సభలను ముగించుకొని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో కొద్దిసేపు దాబా వద్ద అగి చాయ్ తాగి సేద తీరారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీశ్‌ రావు, ఎంపీ దామోదర్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారితో పాటు పలువురున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement