Friday, April 26, 2024

Telangana: ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. తెలంగాణ నుంచి ముగ్గురు సెల‌క్ట్‌!

జాతీయ ఉత్త‌మ ఉపాధ్యాయ పుర‌స్కారాల‌ను కేంద్రం ప్ర‌క‌టించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ పురస్కారాలకు ముగ్గురు టీచ‌ర్లు ఎంపిక‌య్యారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు టీఎన్ శ్రీధ‌ర్‌, ములుగు జిల్లా అబ్బాపూరం స్కూల్​ టీచర్​ కంద‌ల‌ రామ‌య్య‌, నాచారం ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్ ప్రిన్సిప‌ల్ సునీతారావుకు ఈ జాతీయ ఉత్త‌మ ఉపాధ్యాయ‌ పుర‌స్కారాలు ద‌క్కాయి.

కాగా, సెప్టెంబ‌ర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్స‌వం సంద‌ర్భంగా వీరికి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము అవార్డుల‌ను అంద‌జేయ‌నున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 46 మంది టీచ‌ర్ల‌ను జాతీయ ఉత్త‌మ ఉపాధ్యాయుల‌గా ఎంపిక చేయగా అందులో తెలంగాణ నుంచి ముగ్గురికి అవకాశం దక్కడం గమనార్హం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement