Sunday, April 28, 2024

పంటలు కొనే బాధ్యత కేంద్రానిదే: బీజేపీపై తెలంగాణ మంత్రులు ఆగ్రహం

పంటలు కొనే బాధ్యత కేంద్రానిదే అని తెలంగాణ మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి సహకారం లేదన్నారు. బీజేపీ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతోందని మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ పాచికలు తెలంగాణలో పారవన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రానికి స్పష్టత లేదన్నారు. తాము వరిపంట వేయొద్దని ముందే చెప్పాని తెలిపారు. బీజేపీ నేతలనే రైతులతో వరిపంట వేయించారని మండిపడ్డారు. కేంద్రంతో కొనిపించే బాధ్యత నాదని బండిసంజయ్ చెప్పారని గుర్తు చేశారు. యాసంగిలో పంట కొనేవరకు పోరాటం ఆగదన్నారు. తెలంగాణ రైతులకు కేంద్రం అన్యాయం చేస్తోందని ఆరోపించారు.  ప్రతి గింజ కొంటామని చెబుతూనే రారైస్ కావాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణపై బీజేపీ నేతలకు అక్కసు ఎందుకని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణను అవమానించినవారు చరిత్రలో కలిసిపోయారని పేర్కొన్నారు. కేంద్రం లేకీ మనస్తత్వంతో మాట్లాడుతోందన్నారు. కిషన్ రెడ్డి చర్చేవరకు కేంద్రమంత్రిగా ఉంటారా? అని  వ్యాఖ్యానించారు. వడ్లు కొనాలని కిషన్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇన్నిసార్లు ఢిల్లీకి మేం వెళ్తే మాతో కలిసి కిషన్ రెడ్డి ఎందుకు పీయూష్ గోయల్ ను కలవలేదని నిలదీశారు. ఉగాది తర్వాత ఉద్యమం ఉధృతం చేస్తామని నిరంజన్ రెడ్డి ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement