Friday, April 26, 2024

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నెల 7 నుంచి జరగాల్సిన పరీక్షలు కరోనా వ్యాప్తి దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ఇంటర్‌బోర్డు వెల్లడించింది. వాయిదాపడ్డ ప్రాక్టికల్స్‌ను‌, థియరీ పరీక్షల తరవాత మే 29 నుంచి జూన్‌ 7 వరకు నిర్వహిస్తామని తెలిపింది.

తెలంగాణలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు కూడా వాయిదా వేశారు. వాస్తవానికి ఈ నెల 7 నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే, రాష్ట్రంలో కొవిడ్ కేసులు భారీగా వస్తున్న పరిస్థితుల్లో ప్రాక్టికల్స్ నిర్వహించకపోవడమే మంచిదని ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement