Thursday, May 16, 2024

తెలంగాణ కొత్తగా 4,723 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 4,723 కరోనా కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్య శాఖ బుధవారం సాయంత్రం వెలువరించిన హెల్త్‌ బులెటిన్‌ ప్రకారం మొత్తం కేసులు 5,11,711కు చేరాయి. తాజాగా కరోనాతో బాధపడుతూ మరో 31 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2,834కు చేరింది. ఇప్పటివరకూ 4,49,744 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 59,133 క్రియాశీల (యాక్టివ్‌) కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 745 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బులెటిన్ ప్రకారం ఈ ఒక్కరోజు రాష్ట్రంలో 5695 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement