Wednesday, May 8, 2024

తెలంగాణ కరోనా అప్ డేట్: నాలుగు జిల్లాల్లో జీరో కేసులు

తెలంగాణలో గడచిన 24 గంటల్లో 75,199 కరోనా పరీక్షలు చేయగా.. 315 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 340 మంది కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,60,786 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 6,51,425 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,470 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కరోనాతో 3,891 మంది చనిపోయారు.

కాగా తాజా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 83 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 21, వరంగల్ అర్బన్ జిల్లాలో 21, కరీంనగర్ జిల్లాలో 20 కేసులు వెల్లడయ్యాయి. నారాయణపేట, కొమరంభీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement