Thursday, May 2, 2024

ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రధాన అంశాలను ప్రధాని వద్ద ప్రస్తావించారు. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌పై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ, ఏపీ మధ్య జలవివాదం, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధానితో సీఎం చర్చించారు.

కాగా, ఈనెల 1న ప్రత్యేక విమానంలో హస్తనకు వెళ్లిన కేసీఆర్​.. గురువారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా, జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌లనూ.. సీఎం కలిసే అవకాశం ఉంది. వీరిద్దరినీ కలిశాకే సీఎం కేసీఆర్ హైదరాబాద్​ వస్తారని సమాచారం. వీరి అపాయింట్​మెంట్ల కోసం సీఎంవో ఇప్పటికే ఆయా శాఖలను సంప్రదించింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement