Thursday, April 18, 2024

Tollywood drug cas: రకుల్ ను 7 గంటలు విచారించిన ఈడీ

టాలీవుడ్ డ్రగ్​ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణకు హాజరైన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ విచారణ ముగింది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్‌, నటి ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ అధికారులు.. శుక్రవారం రకుల్‌ ను ప్రశ్నించారు. విచారణ నిమిత్తం రకుల్‌.. జూబ్లీహిల్స్​లోని తన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వచ్చిన రకుల్​ను… దాదాపుగా ఆరు గంటల పాటు విచారించారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంక్‌ ఖాతాలను అధికారులు పరిశీలించారు. ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. ఎఫ్‌ క్లబ్‌ నుంచి డ్రగ్స్‌ సరఫరా అయినట్లు కెల్వీన్‌ ఇచ్చిన సమాచారంతో ఈడీ రకుల్‌కు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్‌ సప్లై, ఎఫ్‌ క్లబ్‌ ఆర్థిక వ్యవహారాలు తదితర అంశాలపై ఈడీ అధికారులు రకుల్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 

డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్ కు చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఆరో తేదీన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే, షూటింగ్స్‌ ఉండటం వల్ల తాను హాజరు కాలేకపోతున్నానని.. కాస్త గడువు ఇవ్వాలని ఈడీ అధికారులను రకుల్‌ కోరారు. అందుకు అంగీకరించని అధికారులు.. మూడు రోజుల ముందుగానే విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఆమె ముందుగానే ఈడీ ఎదుట హాజరయ్యారు. కాగా,  ఈనెల 8న హీరో రానా ఈడీ విచారణకు రానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement