Friday, April 26, 2024

17 ఏళ్ల యువతికి మద్యం తాగించి గ్యాంగ్​ రేప్​.. నలుగురు నిందితులు అరెస్టు!

గుజరాత్‌ రాష్ట్రం కచ్ జిల్లాలో ఘోరం జరిగింది. భుజ్ పట్టణ శివార్లలో 17 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, మద్యం తాగించి మరీ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొంతమంది దుండగులు.  మార్చి 16న భుజియా ప్రాంతంలోని కొండ దిగువన ఉన్న పొలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్టు చేసినట్టు కచ్ వెస్ట్ పోలీసు సూపరింటెండెంట్ సౌరభ్ సింగ్ తెలిపారు. టీనేజ్ బాధితురాలు అపస్మారక స్థితిలో పడి ఉందని, చుట్టుపక్కల నివాసితులు గమనించి ఆసుపత్రికి తరలించినట్టు ఆయన చెప్పారు.

ఆమె స్నేహితుడితో కలిసి పొలానికి వెళ్లింది. అక్కడ నిందితులు ఆమెకు మద్యం తాగించి, తామూ తాగారు. ఆ తర్వాత వారు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా నలుగురిని అరెస్టు చేశాం అని ఎస్పీ తెలిపారు. బాధితురాలు తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని గుర్తుపట్టింది. ఆ తర్వాత మద్యం మత్తులో ఆమె స్పృహతప్పి పడిపోయింది. రెండో వ్యక్తి తనపై అత్యాచారం చేసినట్లు ఒప్పుకున్నాడు.

ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు మిగిలిన ఇద్దరు నిందితులు కూడా ఆమెపై అత్యాచారం చేశారా? అనే దానిపై విచారణ జరుగుతోంది. అని ఎస్పీ పేర్కొన్నారు.  నలుగురు నిందితులపై భుజ్ బి డివిజన్ పోలీసులు రేప్​ కేసుతో పాటు పోక్సో కింద కేసు నమోదు చేశారు. కాగా, నిందితులను హుస్సేన్ కాకల్ (35), రాహుల్ సత్వారా (19), వల్జీ వధియారా (24), మహేశ్వర్​ (20)గా గుర్తించామని, వీరందరికీ 10 రోజుల పోలీసు కస్టడీ విధించినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement