Wednesday, May 1, 2024

Big Breaking | ఆసిస్ పై టీమిండియా ఘన విజయం.. నిలబడి కుమ్మేసిన బ్యాటర్లు

వన్డే వరల్డ్​ కప్​లో భాగంగా ఇవ్వాల (ఆదివారం) చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్​లో ఆసీస్​పై టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్​ చేసిన ఆసీస్​ జట్టును 199 పరుగులకే ఆలౌట్​ చేశారు. పెద్దగా స్కోరు చేయకుండా బౌలర్లు కట్టుదిట్టం చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్​లో టాప్​ ఆర్డర్​ విఫలమైనా, కోహ్లీ, రాహుల్​ నిలబడి కుమ్మేశారు. 201 పరుగులతో వరల్డ్​ కప్​లో తొలి విజయంతో బోణీ కొట్టారు. ఇందులో కోహ్లీ (85), రోహిత్​ (0), ఇశాన్​ కిషన్​ (0), శ్రేయస్​ అయ్యర్​ (0) పరుగులు చేయగా.. రాహుల్​ 97, హార్దిక్​ పాండ్యా 11 పరుగులతో నాటౌట్​గా నిలిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement