Monday, April 29, 2024

TS | 9న భూపాలపల్లి కి రామన్న రాక.. పర్యటనకు పకడ్బంది ఏర్పాట్లు

ప్రభన్యూస్ ప్రతినిధి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సోమవారం మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పర్యటించనున్నారు. హైదరాబాదు నుంచి హెలీక్యాప్టర్​లో ఆయన భూపాలపల్లి జిల్లాకు చేరుకుంటారు. సమీకృత కలెక్టరేట్ ప్రారంభం, డబుల్ బెడ్రూంల ప్రారంభోత్సవం , సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణలో ఆయన పాల్గొంటారు. అనంతరం నూతన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

ఆ తర్వాత ర్యాలీ గా బయలు దేరి సుభాష్ కాలనీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత జిల్లా కలెక్టరేట్లో మ్ముఖ్య అతిథులు, అధికారులతో సమీక్షలో మంత్రి కేటీఆర్​ పాల్గొననున్నారు. కాగా మంత్రి పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి, కలెక్టర్ భవేస్ మిశ్రా ఏర్పాట్లు పర్యవేక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement