Sunday, May 5, 2024

నేడు ఉక్రెయిన్, ర‌ష్యా మ‌ధ్య మ‌రోసారి చ‌ర్చ‌లు

గ‌త‌ 19 రోజులుగా ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జ‌రుగుతోంది. ఓ వైపు చర్చలు అంటూనే రష్యా దండయాత్ర సాగిస్తోంది. ఇప్పటికే మూడు దఫాలుగా చర్చలు జరిగినా సానుకూల ఫలితం రాలేదు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు సమావేశం కానున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ చర్చలు జరగనున్నట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారని రష్యన్ వార్తా సంస్థ సుత్నిక్ పేర్కొంది. యుద్ధ భూమి నుంచి విదేశీయులు, ఉక్రెయిన్ పౌరులు సేఫ్‌గా బయటపడేందుకు హ్యుమానిటేరియన్ కారిడార్లు ఏర్పాటు చేయడం, ఆయా సమయాల్లో కాల్పుల విరమణ పాటించడం మినహా సాధించిందేమీ లేదు. ఈ క్రమంలో ఈరోజు మరోసారి రెండు దేశాలు చర్చలకు సిద్ధమయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement