Monday, April 29, 2024

యాద‌గిరిగుట్ట‌లో ప‌ర్య‌టించ‌నున్న -స్వ‌రూపానందేంద్ర‌స్వామి

నేడు యాద‌గిరిగుట్ట‌లో ప‌ర్య‌టించ‌నున్నారు విశాఖ శార‌దా పీఠాధిప‌తి శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామి. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుని ..అక్క‌డ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాద‌గిరిగుట్ట‌కు రానున్నారు..ఆల‌య‌పునఃప్రారంభం త‌ర్వాత మొద‌టిసారి యాదాద్రిలో ప‌ర్య‌టిస్తుండ‌టం విశేషంగా మారింది. ఆల‌య నిర్మాణం ప‌రిశీలించిన త‌ర్వాత ఆయ‌న యాద‌మ‌హ‌ర్షి విగ్ర‌హాన్ని సంద‌ర్శించ‌నున్నారు. అనంత‌రం స్వామి మీడియాను ఉద్దేశించి మాట్లాడ‌నున్నారు. కాగా మ‌ధ్యాహ్నం 12గంట‌ల‌కు తిరుగుప‌య‌నం కానున్నారు స్వామి.

Advertisement

తాజా వార్తలు

Advertisement