Tuesday, April 30, 2024

Breaking: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది. మణికొండ జాగీర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. మణికొండ ల్యాంకోహిల్స్‌ నిర్మాణ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ల్యాంకోహిల్స్‌లో నిర్మాణాలు జరుగుతున్న1654.32 ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని స్పష్టం చేసింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టి సుప్రీం తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2012 ఏప్రిల్‌ 3న వక్ఫ్‌ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

కాగా, 2016 నుంచి మణికొండ జాగీర్ భూముల కేసు సుప్రీం కోర్టులో కొనసాగుతోంది. సుప్రీం తీర్పుతో 1,654 ఎకరాలపై ప్రభుత్వానికి సర్వ హక్కులు దక్కనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement