Sunday, April 28, 2024

ఆ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రిలీవ్ అయిన ఉద్యోగులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ఏపీ నుంచి తెలంగాణకు 12 మంది ఉద్యోగులు రిలీవ్ అయ్యారు. సర్వీసు క్రమబద్ధీకరణ, పెండింగ్‌ జీతాలపై ఉద్యోగులు సుప్రీంను ఆశ్రయించారు. రిలీవ్‌ అయిన ఉద్యోగుల తరఫున అనుమోలు వెంకటేశ్వరరావు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక ఆదేశాలించింది. ఉద్యగులకు 3 వారాల్లోపు పెండింగ్‌ జీతాలు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సర్వీసు బ్రేక్‌ లేకుండా క్రమబద్ధీకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. ఒక్కో రాష్ట్రం ఒక్కో అభ్యర్థికి రూ.10 వేలు చొప్పున చెల్లించాలని సూచించింది. కోర్టుకు రాని మిగిలిన అభ్యర్థులకు కూడా పోస్టింగ్‌ ఇవ్వాలని స్పష్టం చేశారు.  ఈ మేరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement