Monday, April 29, 2024

సూర్యుడు..భూమి మధ్యలోకి రానున్న చంద్రుడు-మళ్ళీ చూడాలంటే 2032తర్వాతే

సూర్యుడు..చంద్రుడు..భూమి ఒకే కక్ష్యలోకి రానుంది. దీంతో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ నెల 25న ఉదయం 8.58 గంటలకు పాక్షిక సూర్యగ్రహణం మొదలవుతుంది. మధ్యాహ్నం 1.02 గంటలకు ముగుస్తుంది. కంటికి రక్షణనిచ్చే సాధనాలతో చూడొచ్చు.న్యూమూన్ (చంద్రుడి ముఖం) సూర్యుడు అభిముఖంగా వెళ్లినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అప్పుడు సూర్యుడి కిరణాలు భూమిని చేరుకోకుండా చంద్రుడు అడ్డు పడతాడు. భూమికి, సూర్యుడికి మధ్య కక్ష్యలోకి చంద్రుడు ప్రవేశించినప్పుడు ఇలా జరుగుతుంది. దీంతో చంద్రుడి నీడ భూమిపై పడుతుంది. దీన్ని సూర్యగ్రహణంగా చెబుతారు. 
సూర్యుడు, చంద్రుడు, భూమి సరిగ్గా ఒకే కక్ష్యలో లేనప్పుడు.. సూర్యుడి ఉపరితంలో కొంత భాగం చీకటిగా మారినప్పుడు పాక్షిక సూర్య గ్రహణంగా చెబుతారు. పాక్షిక సూర్య గ్రహణంలో ఆరంభం, గరిష్ఠం, ముగింపు అని మూడు భాగాలు ఉంటాయి. ఆరంభంలో చంద్రుడు సూర్యుడి డిస్క్ లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత సూర్యుడిలో అధిక భాగాన్ని కప్పేస్తాడు. ఆ తర్వాత క్రమంగా పక్కకు జరుగుతాడు. మళ్లీ పాక్షిక సూర్యగ్రహం 2025 మార్చి 29న చోటు చేసుకోనుంది. కాకపోతే దీన్ని మనం వీక్షించలేం. తిరిగి 2032 నవంబర్ 3న ఏర్పడే పాక్షిక సూర్యగ్రహణం మనకు కనిపిస్తుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement