Saturday, April 20, 2024

రాజన్నను దర్శించుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

  • స్వాగతం పలికిన అధికారులు, అర్చకులు..
  • కోడె మొక్కు చెల్లించి.. ప్రత్యేక పూజలు
    వేములవాడ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ, ఐపీఎస్‌ అధికారి సజ్జనార్‌ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. మంగళవారం స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన ఎండీ దంపతులకు ఎస్పీ రాహుల్‌ హెగ్డే, అడిషనల్‌ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్ర చారిలు పూల మొక్కలను అందించి స్వాగతం పలికినారు. అనంతరం ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభ స్వాగతం పలకగా, అర్చకులు వేదమంత్రోచ్ఛర‌ణ‌లతో ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారి ప్రత్యేక పూజలు చేసి, కోడె మొక్కు చెల్లించుకున్నారు. అలాగే కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచినం చేసి శేషవస్త్రం కప్పి అడ్డుప్రసాదం అందజేశారు. అనంతరం స్వామి వారి నిత్య కల్యాణంలోనూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ దంపతులు పాల్గొన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement