Saturday, April 27, 2024

Breaking | కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మ‌హ‌త్యా య‌త్నం..

హైద‌రాబాద్‌లోని ఫేమ‌స్ టూరిజం స్పాట్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి పై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఇది గ‌మ‌నించిన దుర్గం చెరువు లేక్ పోలీసులు వెంట‌నే చెరువులోకి దూకి ఆ అమ్మాయిని కాపాడారు. హైద‌రాబాద్ రేతిబౌలికి చెందిన హర్షిత (19)గా పోలీసులు చెబుతున్నారు. వెంట‌నే స‌మీపంలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఎట్లాంటి ఇబ్బంది లేద‌ని పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement