Tuesday, May 7, 2024

భారీ న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి స్టాక్ మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ముగిశాయి. లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం వరకు కొంత ఊగిసలాట ధోరణిని ప్రదర్శించినప్పటికీ… ఆ తర్వాత కుప్పకూలాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధ విరమణకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 709 పాయింట్లు నష్టపోయి 55,776కి పడిపోయింది. నిఫ్టీ 208 పాయింట్లు కోల్పోయి 16,663కి దిగజారింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. మహీంద్రా అండ్ మహీంద్రా (2.31%), మారుతి (1.40%), నెస్లే ఇండియా (0.82%), ఏసియన్ పెయింట్స్ (0.81%), టైటాన్ (0.47%). టాటా స్టీల్ (-4.89%), కోటక్ బ్యాంక్ (-3.11%), టెక్ మహీంద్రా (-2.92%), ఇన్ఫోసిస్ (-2.73%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-2.28%) టాప్ లూజర్స్ మిగిలాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement