Sunday, May 5, 2024

లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ర‌ష్యాతో నాటో బ‌ల‌గాలు యుద్ధం చేయ‌బోవ‌ని..నాటో స‌భ‌త్వం కోసం ఇక‌పై తాను ఒత్తిడి చేయ‌బోన‌ని ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ ప్ర‌క‌టించారు. దాంతో స్టాక్ మార్కెట్ల‌పై అనుకూల ప్ర‌భావాన్ని చూపింది. రష్యా డిమాండ్ కూడా ఇదే కావడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి 1,223 పాయింట్లు లాభపడి 54,647కి చేరకుంది. నిఫ్టీ 331 పాయింట్లు పెరిగి 16,345కి ఎగబాకింది. ఏసియన్ పెయింట్స్ (5.56%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (5.24%), బజాజ్ ఫైనాన్స్ (5.13%), మహీంద్రా అండ్ మహీంద్రా (4.94%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (4.18%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. ప‌వర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.89%), ఎన్టీపీసీ (-1.57%), టాటా స్టీల్ (-1.15%), నెస్లే ఇండియా (-0.88%), విప్రో (-0.31%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement