Thursday, May 9, 2024

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈ వారాన్ని స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. సెన్సెక్స్ 143పాయింట్లు పెరిగింది. ఇక 67పాయింట్లు లాభ‌ప‌డింది నిఫ్టీ. ఇక 1.79శాతం పెరిగింది ఏసియ‌న్ పెయింట్స్ షేర్ విలువ. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు లాభపడి 59,745కి పెరిగింది. నిఫ్టీ 67 పాయింట్లు పుంజుకుని 17,813 వద్ద స్థిరపడింది. ఏసియన్ పెయింట్స్ (1.79%), టీసీఎస్ (1.26%), నెస్లే ఇండియా (1.23%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.18%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.06%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. బజాజ్ ఫిన్ సర్వ్ (-1.39%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.31%), ఎల్ అండ్ టీ (-1.06%), బజాజ్ ఫైనాన్స్ (-1.00%), హెచ్డీఎఫ్సీ (-0.98%) టాప్ లూజర్స్ గా నిలిచాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement