Monday, May 6, 2024

భారీ లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్స్

నేటి స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల‌తో ముగిశాయి. ఆసియా మార్కెట్ల‌న్నీ పాజిటీవ్ గా ఉండ‌టంతో స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 612 పాయింట్లు లాభపడి 56,931కి పెరిగింది. నిఫ్టీ 185 పాయింట్లు పెరిగి 16,955కి ఎగబాకింది. ఈ రోజు అన్ని సూచీలు లాభాలను మూటగట్టుకున్నాయి. బజాజ్ ఫైనాన్స్ (2.94%), ఎల్ అండ్ టీ (2.69%), భారతి ఎయిర్ టెల్ (2.67%), సన్ ఫార్మా (2.47%), రిలయన్స్ (2.42%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచింది. విప్రో (-0.58%), ఐటీసీ (-0.24%), నెస్లే ఇండియా (-0.17%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement