Sunday, April 28, 2024

భారీ న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ న‌ష్టాల‌తో ముగిశాయి. ఉదయం బలహీనంగా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. అనంతరం మరింత భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 624 పాయింట్లు పతనమై 59,021 వద్ద ముగియగా.. నిఫ్టీ 189 పాయింట్ల నష్టంతో 17,569 వద్ద ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 2శాతం కుప్పకూలింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.5శాతం, యాక్సిస్ బ్యాంక్ ,టెక్ మహీంద్రా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దివీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, అపోలో హాస్పిటల్స్‌ కూడా నష్టాల్లో కొనసాగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement