Saturday, May 11, 2024

అల్లరి నరేశ్​ మరో ఇంట్రెస్టింగ్​ ప్రాజెక్ట్​.. ‘ఉగ్రం’గా ప్రేక్షల ముందకు!

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క‌మిడియ‌న్ హీరోగా త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించున్న న‌టుడు అల్ల‌రి న‌రేష్. అయితే 2021లో వ‌చ్చిన నాంది మూవీతో త‌న రూట్‌ మార్చేశాడు ఈ న‌టుడు.. నరేష్ నాంది చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. అంత‌కుముందు క‌మిడియ‌న్ గా గుర్తింపు పొందిన న‌రేష్.. నాంది సినిమాతో కామెడీ మాత్ర‌మే కాకుండా త‌ను యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ కూడా చేయ‌గ‌ల‌ను అని నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు.

అయితే.. అల్లరి నరేష్, నాంది దర్శకుడు విజయ్ కనకమేడల కాంబోలో మ‌రో ప్రాజెక్ట్ క‌న్ఫార్మ్ అయ్యిది. కాగా, వీరి కాంబినేష‌న్ లో తెరకెక్కుతున్న సినిమాకి టైటిల్ ఖరారు చేశారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమాకు ‘ఉగ్రం’ అనే పేరు పెట్టిన‌ట్టు ఇవ్వాల (సోమవారం) ప్రకటించారు. ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ థ్రిల్లర్ లో అల్లరి నరేష్ మరింత ఇంటెన్సెవ్​గా కనిపించాడు. పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. నరేష్ తన నటనా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి మరో చాలెంజింగ్ రోల్ ఉన్న ప్రాజెక్ట్ కి సంతకం చేసినట్లు తెలుస్తోంది.

ఉగ్రం సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఉగ్రమ్‌ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. అల్లరి నరేష్ ఇటీవలే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఇది ఈ ఏడాదే విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement