Tuesday, May 14, 2024

389 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్.. లాభాల్లోనే ముగిసిన మార్కెట్లు

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే, రష్యా, ఉక్రెయిన్ లు చర్చలకు సిద్ధమవడం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 389 పాయింట్లు లాభపడి 56,247కి చేరుకుంది. నిఫ్టీ 136 పాయింట్లు పెరిగి 16,794 వద్ద స్థిరపడింది. 

టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టైటాన్, ఎన్టీపీసీ టాప్ గెయినర్స్ గా నిలువగా..  డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ నష్టాలు చవిచూశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement