Saturday, April 27, 2024

న‌ష్టాల‌తో ముగిసిన – స్టాక్ మార్కెట్లు

న‌ష్టాల‌తో ముగిశాయి నేటి స్టాక్ మార్కెట్లు. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు దాదాపు చివరి వరకు లాభాల్లోనే కొనసాగాయి. చివరి గంటన్నరలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 460 పాయింట్లు నష్టపోయి 57,060కి పడిపోయింది. నిఫ్టీ 142 పాయింట్లు కోల్పోయి 17,102కి దిగజారింది. కొటక్ మహీంద్రా బ్యాంక్ (1.44%), సన్ ఫార్మా (0.94%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.87%), టాటా స్టీల్ (0.86%), డాక్టర్ రెడ్డీస్ (0.28%) బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. యాక్సిస్ బ్యాంక్ (-6.57%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.42%), విప్రో (-2.59%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-2.08%), మారుతి (-1.97%) టాప్ లూజర్స్ గా మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement