Wednesday, April 17, 2024

అప్పన్నహస్తం: మానవత్వం చాటుకున్న కాలనీ వాసులు

ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకోలేని వ్యక్తిని ఆ కాలనీ వాసులు బాసటగా నిలిచారు. ఆయన వైద్యం కోసం అప్పన్నహస్తం అందించారు. వివరాల్లోకి వెళ్లితే.. వరంగల్ మహానగరంలోని 44 డివిజన్ పరిధిలోని కడిపికొండ కాళోజి ఇంద్రనగర్ కాలనీకి చెందిన బండి దేవేందర్ అనే వ్యక్తి అనారోగ్యంకు గురియ్యారు. హన్మకొండలోని ప్రైవేట్ హాస్పిటల్ చూపించిన ఫలితం లేదు. దీంతో హన్మకొండ నుండి హైదరాబాద్ లో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, మెరుగైన వైద్యం కోసం ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు. ఈ విషయం తెలుసుకున్న కాలనీ వాసులు ముందుకు వచ్చి.. ప్రతి ఒక్కరూ కలిసి సహాయం అందించారు. విరాళంగా వచ్చిన మొత్తాన్ని 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని దేవేందర్ కుటుంబానికి అందించారు. అంతేకాకుండా అయ్యప్ప సంక్షేమ సంఘం వారు 35000 రూపాయలు, కాంట్రాక్టు డ్రైవర్స్ అసోసియేషన్ వారు 6000 రూపాయలు దేవేందర్ కుటుంబానికి అందిచారు. వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆడుకోవాలని కాలనీ వాసులు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement