Thursday, May 2, 2024

TS | ఆరోగ్య తెలంగాణ లక్ష్యం.. జిల్లాకో మెడికల్​ కాలేజీ ఏర్పాటు: మంత్రి హ‌రీశ్‌రావు

సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణలో జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. 60 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అతి తక్కువ సమయంలో మొత్తం 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించి దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించింది అన్నారు. పెద్ద మొత్తంలో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ, వైద్య సిబ్బందిని నియమిస్తూ ఆరోగ్య రంగాన్ని పటిష్టం చేసినట్లు హరీశ్​రావు చెప్పారు.

ఇటీవల ఏక కాలంలో 1061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నియమించడం వల్ల టీచింగ్ ఆసుపత్రులు మరింత బలోపేతమై అయినట్లు చెప్పారు. సోమవారం టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్షను మంత్రి నిర్వహించారు. సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డిఎంఇ రమేష్ రెడ్డి, అరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, అన్ని ఆసుపత్రుల సూపరింటెండెంట్లు మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్ లు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందెందుకు, ప్రభుత్వం తరఫునుంచి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. మీ వంతుగా ప్రతి ఒక్కరు బాగా పని చేయాలనీ కోరుతున్నాను. కొద్ది కాలం నుండి మనందరం చేస్తున్న కృషి వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఘనంగా ప్రకారం మాతృ మరణాల రేటు రాష్ట్రంలో ఘనంగా తగ్గింది. తెలంగాణ ఏర్పడినాడు 92 గా ఉంటే ఇప్పుడు 43 కు తగ్గించగలిగాము. వైద్య ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది. ఇవన్నీ మీరంతా చేస్తున్న కృషికి నిదర్శనం. అయితే దీంతో మనం సంతృప్తి చెందకూడదు. ఆరోగ్య రంగంలో తెలంగాణ నెంబర్ 1 గా నిలవాలి. సీఎం కేసీఆర్ గారు పెద్ద మొత్తంలో బడ్జెట్ ఇచ్చారు. కొత్త మెడికల్ కాలేజీలు ఇచ్చారు, వైద్యులు ఇచ్చారు, వైద్య పరికరాలు ఇచ్చారు… ఇలా అడిగినవన్నీ మనకు వెంటనే మంజూరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేరేలా మనందరం కృషి చేయాలని మంత్రి హరీశ్​ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement