Thursday, May 2, 2024

చేనేత వస్త్ర ప్రదర్శనని ప్రారంభించిన – మంత్రి గంగుల కమలాకర్

చేనేత వస్త్రాలను ధరించి ..చేనేత కార్మికులకు ప్రోత్సాహకం అందించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కోర్టు చౌరస్తా వద్దగల శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో చేనేత , జౌళీ శాఖ కరీంనగర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాష్ట్రస్థాయి చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకాలను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం 40 స్టాళ్లలో ఏర్పాటుచేసిన రాష్ట్ర చేనేత సహకార సంఘాల ఉత్పత్తుల వస్త్రాలను, 20 స్టాళ్లలో ఏర్పాటుచేసిన ఇతర రాష్ట్రాల చేనేత వస్త్రాలను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ..చేనేతకు చేయూత నిచ్చేందుకు ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని అన్నారు.చేనేత కార్మికులకు ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్రస్థాయి చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement