Sunday, April 28, 2024

Flash: ఏపీలో పదో తరగతి పరీక్షల పేపర్ లీక్!

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల తొలి రోజే పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కావడం కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లాలో పేపర్ లీక్ అయినట్టు వార్తలు వచ్చాయి. కొలిమిగుండ్ల మండలం అంకిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు లాంగ్వేజ్ పేపర్ లీక్ అయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. బుధవారం పరీక్ష ప్రారంభమైన అరగంట తర్వాత అక్కడ వాటర్ బాయ్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తి సెల్ ఫోన్ ద్వారా తెలుగు పరీక్ష పత్రం వాట్సప్ ద్వారా బయట వ్యక్తులు చేరవేయడంతో అవి పలు గ్రూపులలో వెళ్లి హల్ చల్ చేశాయి. విషయం డిప్యూటీ డీఈవో దృష్టికి వెళ్లడంతో తక్షణమే వారు ఎంఈఓ శ్రీధరరావును విచారణ నిమిత్తం పరీక్ష కేంద్రానికి పంపారు. ఆ గదిలో ఇన్విజిలేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడిని ,సూపర్వైజర్ ను, సస్పెండ్ చేసినట్లు పరీక్ష నిర్వహణ అధికారి సుధాకర్ గుప్తా, ఎంఈఓ శ్రీధర్ రావు తెలిపారు. ఈ విషయంపై పూర్తి విచారణ చేపడుతున్నట్లు చెప్పారు. కాగా, పది తెలుగు ప్రశ్నాపత్రం లీకు అయిన అంశంపై  విద్యా శాఖ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement