Thursday, May 2, 2024

Srikakulam : ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి.. త‌ల్లి ఆత్మ‌హ‌త్య

ఇద్ద‌రు పిల్ల‌లను చంపి.. ఆత‌ర్వాత త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. దమ్మలవీధిలో నివాసముంటున్న ధనలక్ష్మి(35) త‌న ఇద్దరు పిల్లలైన సోనియా(11) యశ్వంత్‌(9)కు ఉరేసి తాను ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం కలిగించింది. ముందుగా వారికి ఉరేసి ఆ తరువాత ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను కుటుంబసభ్యులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement