Friday, April 26, 2024

Breaking: ఆలేరు ద‌గ్గ‌ర బ‌స్సు బీభ‌త్సం.. కూలీలపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆలేరు దగ్గర రోడ్డు పనులు చేస్తున్న కూలీలపైకి బస్సు దూసుకెళ్లడంతో ముగ్గురు చనిపోయారు. ప‌లువురికి గాయాల‌య్యాయి. ఈ ఘ‌ట‌న ఆలేరు మండ‌లం మంత‌పురి బైపాస్ వ‌ద్ద జ‌రిగింది. డివైడ‌ర్ పనులు చేస్తుండ‌గా కూలీల‌తో పాటు ట్రాక్ట‌ర్‌ను ఆర్టీసీ బ‌స్సు ఢీకొట్టిన‌ట్టు తెలుస్తోంది. దీంతో అక్క‌డిక‌క్క‌డే ముగ్గురు కూలీలు మృతి చెందారు. మ‌రి కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మిగితా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement