Tuesday, April 30, 2024

ఆర్థిక నిపుణుల బృందాన్ని నియమించిన – శ్రీలంక అధ్యక్షుడు

శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే.. ఆర్థిక నిపుణులతో కూడిన రుణ సుస్థిరత సలహా మండలిని ఏర్పాటు చేసినట్లు వెల్ల‌డించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక మాజీ గవర్నర్ ఇంద్రజిత్ కుమారస్వామి, ప్రపంచ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకనామిస్ట్ శాంతా దేవరాజన్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) ఇన్‌స్టిట్యూట్ ఫర్ కెపాసిటీ డెవలప్‌మెంట్ మాజీ డైరెక్టర్ శర్మినీ కూరే ఈ సలహా సభ్యులలో ఉన్నారు. డివిజన్ సలహా కమిటీ సభ్యులు ఇప్పటికే IMF తో తరచుగా కమ్యూనికేషన్ లో ఉండ‌టంతో వారు చర్చించడానికి అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ గ్రూప్ విధుల్లో కీలకమైన శ్రీలంక సంస్థలు.. IMFతో కలిసి పనిచేస్తున్న అధికారులతో చర్చలు జరపడం, అలాగే ప్రస్తుత రుణ సంక్షోభాన్ని పరిష్కరించి శ్రీలంక స్థిరమైన ..సమ్మిళిత పునరుద్ధరణకు దారితీసే సలహాలను అందించడం వంటివి ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి చర్చల్లో పాల్గొన్న శ్రీలంక అధికారులతో సమావేశమై ప్రస్తుత రుణ సంక్షోభాన్ని ఎలా పరిష్కరించాలనే దానిపై సలహాలను అందించే బాధ్యతను ఈ సలహా బృందానికి అప్పగించినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement