Thursday, April 18, 2024

Covid-19: దేశంలో కొత్తగా 1033 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1033 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,31,958కు చేరాయి. ఇందులో 4,24,98,789 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 1,222 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. నిన్న దేశవ్యాప్తంగా 43 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,21,530కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 11,639 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.76 శాతంగా ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 0.21 శాతంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement