Saturday, May 4, 2024

శ్రీ చైతన్య స్కూల్ లో దారుణం.. యూనిఫామ్ ధరించలేదని విద్యార్థులకు శిక్ష

ఖమ్మంలోని శ్రీ చైతన్య స్కూల్ దారుణం జరిగింది. యూనిఫామ్ ధరించకుండా సాధారణ డ్రెస్సుల్లో స్కూల్ కి వచ్చారని విద్యార్థులని గంటకు పైగా నిల్చో బెట్టి స్కూల్ యాజమాన్యం శిక్ష విధించారు. కరోనా లాక్డౌన్ అనంతరం విద్యా సంవత్సరం ముగింపు దశలో యూనిఫామ్ ధరించాలంటూ కొత్త నిబంధన తేవడంతో విద్యార్థులకు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తున్న యజమాన్యం మరోవైపు యూనిఫాం పేరుతో వేధింపులకు పాల్పడడం తో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement