Saturday, May 4, 2024

ఈనెల 28 నుంచి జూన్ 1 వరకు పలు రైళ్లు రద్దు

కరోనా ప్రబలుతున్న కారణంగా ప్రయాణికులు లేకపోవడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఈనెల 28 నుంచి మే 31 మధ్య నరసాపురం-నిడదవోలు, నిడదవోలు-నరసాపురం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు, సికింద్రాబాద్‌-బీదర్‌ ఎక్స్‌ప్రెస్‌, బీదర్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, సికింద్రాబాద్‌-కర్నూలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దుచేసినట్లు అధికారులు ప్రకటించారు. అదేవిధంగా ఈనెల 29 నుంచి జూన్‌ 1 మధ్య కర్నూలు-సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌, ఈనెల 30-మే 28 మధ్య సికింద్రాబాద్‌-ముంబై ఎల్‌టీటీ, మైసూర్‌-రేణిగుంట ఎక్స్‌ప్రెస్‌, వచ్చేనెల 1-మే 29 మధ్య రేణిగుంట-మైసూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులు తమ ప్రయాణాలకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement