Saturday, April 27, 2024

టీమిండియా క్రికెట‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ కి క‌రోనా – వ‌న్డే సిరీస్ కి దూరం

టీమిండియా క్రికెట‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ కి క‌రోనా పాజిటీవ్ గా నిర్థార‌ణ అయింది. ప్ర‌స్తుతం ఆయ‌న హోం ఐసోలేష‌న్ లో ఉన్నాడు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వాషింగ్ట‌న్ సుంద‌ర్ సోష‌ల్ మీడియాలో తెలిపాడు. ఈ మేర‌కు ఈ మ‌ధ్య త‌న‌ని క‌లిసిన వారంతా క‌రోనా ప‌రీక్ష‌ల‌ని చేయించుకోవాల‌ని కోరారు. ఇక క్రికెటర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కు కరోనా సోకడంతో.. సౌతాఫ్రికా జట్టుతో జరిగే… వన్డే సిరీస్‌ కు దూరం కానున్నట్లు సమాచారం . కాగా వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో మరొకరికి ఛాన్స్‌ దక్కనుంది.కాగా.. ఇవాళ్టి నుంచి సౌతాఫ్రికా వర్సెస్‌ టీమిండియా జట్ల మధ్య మూడో టెస్ట్‌ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. వచ్చే వారంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement