Tuesday, April 30, 2024

బండి సంజ‌య్ కి మ‌రోసారి సిట్ నోటీసులు..

TSPSC పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు పెంచింది. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌కు మరోసారి సిట్‌ నోటీసులు ఇచ్చారు. పేపర్‌ లీక్‌పై చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే ఈ కేసులో ఈనెల 24న బండి సంజయ్‌కు సిట్‌ నోటీసులు ఇచ్చింది. అయితే.. ఆ సమయంలో బండి సంజయ్‌ ఇంట్లో లేకపోవడంతో.. ఇంటి గోడకు నోటీసులు అంటించి వెళ్లిపోయారు అధికారులు. మరోవైపు.. తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్న బండి సంజయ్‌.. సిట్‌పై తనకు నమ్మకం లేదని చెప్పారు. ఇప్పుడు మరోసారి బండి సంజయ్‌కు సిట్‌ అధికారులు నోటీసులిచ్చారు. రేపు హాజ‌రు కావాల‌ని సిట్ అధికారులు నోటీసులిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement