Tuesday, April 16, 2024

రాహుల్ గాంధీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బీజేపీ కుట్ర : నరేందర్ రెడ్డి

రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దుకు నిరసనగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్ వద్ద నరేంద్రమోడీ దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు కుట్ర పూరితంగా ఒక పథకం ప్రకారం రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దు చేశారని రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలనుకుంటే పదిహేను సంవత్సరాలక్రితమే అయ్యేవారని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా ప్రజల నుండి వచ్చిన ఆదరణ చూసి బీజేపీ నాయకులు తట్టుకోలేక కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఈ దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబంపై కక్ష పెంచుకోవడాన్ని ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ నాయక్, లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య, విలాస్ రెడ్డి, దండి రవీందర్, కొరివి అరుణ్ కుమార్,జీడీ రమేష్, షబానా మహమ్మద్,దన్న సింగ్, ఎండి చాంద్,అస్తపురం రమేష్, చంద్రయ్య గౌడ్, ముక్క భాస్కర్, మామిడి సత్యనారాయణ రెడ్డి, బొబ్బిలి విక్టర్, కీర్తి కుమార్, జ్యోతి, ఎర్ర శ్రీనివాస్, వంగల విద్యా సాగర్,షేక్ శేహెన్ష, నదీo,నల్లి నరేష్, రాజ్ కుమార్, లింగ మూర్తి, జీలకర రమేష్, శ్రీకర్, అజ్మత్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement